8, జూన్ 2015, సోమవారం

రైతన్నలను ఉసురు
పెడితే ఏం జరుగుద్దో
ఇప్పుడైనా అర్ధమయిందా...
ఏడాదికి మూడు పంటలు
పండించే భూములను
బలవంతంగా లాక్కుని
అన్నదాతను ఉసురు పెట్టారు..
దాని ప్రతిఫలమే
ఇప్పుడిలా మూటకట్టుకుంటున్నారు నేస్తమా..!

రైతుల పక్షపాతిని
అని చెప్పుకునే మనబాసు
రైతులకు మేలు చేయాలి
కాని రైతుల భూములు
లాక్కుని "రియల్" వ్యాపారం చేస్తూ
కొత్త నిర్వచనం చెప్పారు
మన బాబుగారు కదా నేస్తమా..!
ప్రజలకేదో ప్రయోజనం చేస్తారని
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని
నేను మారానని చెప్పిన బాబుగారి
మాటలను నమ్మి గెలిపిస్తే
ఓటుకి నోటిచ్చే కేసులో అడ్డంగా
ఇరుక్కుపోయి తన నైజాన్ని
సైన్యంతో తిప్పికొట్టాలని చూస్తున్నారు
ఇదిలా ఉంటే తెలుగు తమ్ముళ్ళకు
మరో షాక్ ఇస్తున్నారు
బాబుగారు చూసుకోండి తమ్ముళ్ళూ
బైక్ ఉండే తెల్లరేషన్ కార్డు కట్ అట
నిత్యావసర వస్తువుగా మారిన ఈ రోజుల్లో
ఇలా చేయడం సబబే కదా నేస్తమా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి