20, జూన్ 2015, శనివారం

ఓటు నోటుపై
దేశమంతా గగ్గోల పెడుతుంటే
తనకేమీ తెలీయదన్నట్లు
మేము సచ్చీలలము
అన్నట్టున్నారు బీజేపీ నేతలు...
తీరా సొంతపార్టీలోని
మహిళా మణులిద్దరు లలిత్ మోదీ
ఉచ్చులో చిక్కుకున్న తరుణంలో
సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన
మోదీ సర్కారు చిక్కుల్లో
పడకుండా సమర్ధించుకునే
పనిలో పడ్డారు...
పనిలో పనిగా
అంధ్రాలో ఓటుకు నోటు
కేసులో చిక్కుకుని
ఉక్కిరిబిక్కిరి అవుతూ
అలవాటులో పొరపాటుగా
గవర్నర్ ని సైతం
రాజకీయ రొచ్చులోకి
దించే పనిలో పడ్డ నేపధ్యంలో
అయన ఆగ్రహానికి
బలై పోకుండా ఉండాలని
రంగంలోకి దిగిన వెంకన్న
లాలూచే మార్గాలను ఉద్భోదిస్తూ
ఇద్దరు సీయం లూ చక్కనైన
పాలన అందించాలే తప్ప
ఇలా గిల్లికజ్జాలు కూడదని
హితవు చేశారట నేస్తమా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి