20, జూన్ 2015, శనివారం

పార్టీ ఫండ్ కోసమని
లక్ష రూపాయలు తీసుకుంటూ
స్ట్రింగ్ ఆపరేషన్ కి చిక్కిన
దళితుడైన బంగారు లక్ష్మణ్ ను
తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి
బలి పశువును చేసిన
అప్పటి పెద్దలకు
ఇప్పుడు అడ్డంగా దొరికిన సొంత పార్టీ వారిని
ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు
అప్పుడు అమలు చేసిన నైతికత
ఇప్పుడేమైంది..?
======================
ఆ రోజుల్లో ..
బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ..
రాజీనామా చేయించిన
బీజేపీ వెంకన్న గ్యాంగ్
పీకల్లోతు మునిగిపోయిన
ఆ మహిళా మణులను ఎందుకు రక్షిస్తున్నారో...
===============================
ఆంధ్రాని మనిద్దరం
పంచుకుందామని కూడబలుక్కుని
ప్రత్యేక హోదాను పక్కన పెట్టి
"హోదా" మనకెందుకంటూ
ప్రకటనలు ఇప్పించ్చి
మోదీ వద్ద మార్కులు కొట్టేసిన వెంకన్న
చెప్పింది చెప్పినట్టు చేసిన మన బాసు
రుణం తీర్చుకునే పనిలో పడ్డారట
ఓటుకు నోటు కేసులో పోకల్లోతు
ఇరుక్కుపోయిన "బాబు అండ్ కో" ను
రక్షించే పనిలో పడ్డారట నిజమేనా నేస్తమా..!
=============================

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి