2, ఆగస్టు 2015, ఆదివారం

"ఫేస్" బుక్


అమ్మా..! నేనే మీకు భారమయ్యానా అమ్మా..!
=================================
అమ్మా.. అమ్మా..
అని గట్టిగా అరిచి నేనెవరినో
నీకు తెలియజేయాలని ఉందమ్మా..!
అప్పుడే మీకంత భారమయ్యానా
ఏంటమ్మా ఇంకా నేను
కళ్లు కూడా తెరవనే లేదుకదమ్మా..!
నాకిద్దరు ఆక్కలున్నప్పుడు
నన్ను పోషించే స్తోమత లేనప్పుడు
మరి నన్నెందుకు కన్నావమ్మా..!
నేను పుట్టిన నీ పొత్తిళ్ల
వాసన కూడా పోకుండానే
నేను మీకు భారమైపోయానమ్మా..!
ఏంటమ్మా ఈ ఘోరాతి ఘోరం
ఏంటమ్మా ఈ అన్యాయం
అని ప్రశ్నిస్తానని అనుకున్నావమ్మా..!
లేదు లేదు నేను ఎంతో అదృష్టవంతురాలినే
మీరు రోడ్డు పక్కన పడేయకుండా
ఐఎస్డీ వాళ్ళకి అప్పగించినందుకు
మీకు నా ధన్యవాదాలమ్మా..!
అమ్మా.. అమ్మా...
అని పదే పదే పిలిచి మన బంధం
నీకు తెలియజేయాలని నాకున్నా
అలా పిలిచే అదృష్టం ఆ దేవుడు
నాకింకా నేర్పలేదమ్మా ..!
ఏదేమైనా నన్ను నీ కడుపులోనే
చిదిమేయకుండా తొమ్మిదినెలలు
కష్టమైనా నన్ను మోసినందుకు
నీకు ధన్యవాదాలమ్మా..!
నేను కాళ్ళతో తన్నినా భరించి మరీ
నాకు జన్మనిచ్చినా నీకు పునర్జన్మే కదా
అందుకే నిన్ను చంపాననే అపవాది
నామీద పడకుండా చేసినందుకు నీకు ధన్యవాదాలమ్మా..!
(ఆడపిల్లను కన్న వాళ్లు.. వారు భారమయ్యారని చెప్తూ పురిటిలోనే వారిని విసిరి వేస్తున్న సందర్భాలను చూసి నా హృదయం ఇలా చలించింది. జి కొండూరులో నిన్న ఇందుకు భిన్నంగా ఐఎస్డీ వాళ్లకు అప్పగించిన వైనం కొంత ఊరటే అయినా...)

1, జులై 2015, బుధవారం

నేరేడు పండు కాదండోయ్..!
కాలిఫోర్నియాలో పండే టమాటా అట
భలే బాగుంది కదా నేస్తమా..!
మంగళగిరి సాక్షి కార్యాలయంలోని ఎడిటోరియల్ డిపార్ట్ మెంట్లో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న కొల్లి వీర వెంకట శివప్రసాద్ రెడ్డి గారు మంగళవారం పదవీవిరమణ చేసిన సందర్భంగా ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించాము.ఈ సందర్భం గా ఆయనకు నావంతు కర్తవ్యంగా అక్షర సన్మానం చేసే అదృష్టం నాకు కల్గినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ...
=======================================
ప్రసాదరెడ్డి గారికి "అక్షర సన్మానం"
=========================================
వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి
జీవిత లక్ష్యం కోసం అక్షరాలు సాగుచేసి
విలక్షణంగా లక్షణమైన జర్నలిస్టుగా
వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించే దిశగా
ఉదయంలో ఉదయించి,
ఆంధ్ర"భూమి"లో అక్షరాలు పండించిన నేస్తమా..!
కొల్లి వీర వెంకట శివప్రసాద్ రెడ్డి
నామధేయంలో వీరత్వం ఉట్టిపడుతున్నా
ఎవరిమీదా శివప్రతాపం చూపించకుండా
అణుకువే (వెంకన్నే)ఆరాధ్యదైవంగా
సౌమ్యమే పరమావధిగా (ప్రసాదంగా)
ఇరవై ఎనిమిదేళ్ళపాటు
నిర్విరామంగా సేవలందించిన మీకు
"సాక్షి"లో వయసుకు విరామమే వచ్చింది
తప్ప మీ మనసుకు కాదనేది వాస్తవం నేస్తమా..!
మౌనంగా ఎదగమని మొక్కనీకు చెబుతోంది అన్నట్టు
మౌనాన్నే పెట్టుబడిగా పెట్టుకున్న మీరు
అందరి మన్ననలు పొంది
సెహబాష్ అనిపించుకున్నారు కదా నేస్తమా..!
కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన
సోమిరెడ్డి, అనసూయ దంపతులకు
మణిహారంగా నిలిచిన మీకు, మీకుటుంబానికి
సాక్షి కుటుంబం తరఫున ధన్యవాదాలు
తెలియజేస్తున్నాం నేస్తమా..!
-@ కొండా రాజేశ్వరరావు @

హెల్మెట్ ధరించడం మంచిదే
ప్రమాదాలు నివారించవచ్చనడంలో
ఎటువంటి సందేహం లేదు నేస్తమా..!
ఎలక్షన్లలో ఆర్ధికంగా సహకరించారని
ఆ కంపెనీ వారి స్వప్రయోజనాల
కోసమైతే ప్రభుత్వం మళ్ళీమళ్ళీ
తప్పు చేస్తున్నట్లే ఉంది నేస్తమా..!
ప్రమాదం వాటిల్లకూడదంటే
ప్రమాణాలున్న హెల్మెట్ ధరించాలి
అది కొనాలంటే కనీసం ప్రతి ఒక్కరూ
వెయ్యి రూపాయిలు పైనే వెచ్చించాలి నేస్తమా..!
కేవలం పోలీసులు కేసు రాస్తారనే
భయంతో ప్రమాణాలు లేని (ఫైబర్)
హెల్మెట్లే కొంటూ నెట్టుకొచ్చేస్తున్నారు
అవి ధరించిన వారు ప్రమాదాలకు గురై
చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి నేస్తమా..!
ఏదైనా ప్రజా ప్రయోజనం కోసం
చేసే పని చిత్తశుద్దితో చేస్తే మంచిది
60 నుంచి 80వేలు పెట్టి బండి కొనేవారు
వెయ్యి రూపాయలుపెట్టి హెల్మెట్ కొనలేరా ఏంటి
బండితోనే హెల్మెట్ ను కూడా తప్పనిసరి చేసి
సరసమైన ధరకు నాణ్యమైన హెల్మెట్ విక్రయించేలా
చర్యలు తీసుకోవాలనేదే నాకంఠశోష నేస్తమా..!
నమస్తే.. నేస్తమా..!
ఈ రోజు వైద్యుల దినోత్సం.
వైద్యరంగం పూర్తిగా వ్యాపారం అయిపోయి,
సామాన్యునికి అందకుండాపోయింది.
వైద్యరంగ స్థితి గతులపై చర్చించుకోవడానికి
ఇంతకంటే సందర్భం ఏముంటుంది?
=============================
డాక్టర్ అనే వారు
అప్పుడూ,ఇప్పుడూ,ఎప్పుడూ
ఎవరికీ దగ్గరగా ఉండరు నేస్తమా..!
కేవలం డబ్బున్న వారికి
మాత్రమే వారు అందుబాటులో
ఉంటారు నేస్తమా..!
వైద్యం ఎప్పుడూ
ఖరీదైన వస్తువే
సామాన్యుడికి నేస్తమా..!
నాడీ వైద్యం పోయింది
అలోపతి,హోమియోపతి
పేరుతో "పరీక్షల" వైద్యం
ప్రవేశపెట్టేశారు నేస్తమా..!
ఆ ముసుగులో
కమీషన్లకు కక్కుర్తి
పడుతూ డబ్బే
పరమావదిగా వైద్యులు
పరుగులు పెడుతున్నారు నేస్తమా..!
ఈ విధానాన్ని ఎవరొచ్చినా
నిలువరించే అవకాశం గాని
ప్రశ్నించే తత్వం గాని
ధైర్యం గాని ఎవరికీ లేదు
రాబోదు కదా నేస్తమా..!
నమస్తే.. నేస్తమా..!
ఈ రోజు వైద్యుల దినోత్సం.
వైద్యరంగం పూర్తిగా వ్యాపారం అయిపోయి,
సామాన్యునికి అందకుండాపోయింది.
వైద్యరంగ స్థితి గతులపై చర్చించుకోవడానికి
ఇంతకంటే సందర్భం ఏముంటుంది?
=============================
డాక్టర్ అనే వారు
అప్పుడూ,ఇప్పుడూ,ఎప్పుడూ
ఎవరికీ దగ్గరగా ఉండరు నేస్తమా..!
కేవలం డబ్బున్న వారికి
మాత్రమే వారు అందుబాటులో
ఉంటారు నేస్తమా..!
వైద్యం ఎప్పుడూ
ఖరీదైన వస్తువే
సామాన్యుడికి నేస్తమా..!
నాడీ వైద్యం పోయింది
అలోపతి,హోమియోపతి
పేరుతో "పరీక్షల" వైద్యం
ప్రవేశపెట్టేశారు నేస్తమా..!
ఆ ముసుగులో
కమీషన్లకు కక్కుర్తి
పడుతూ డబ్బే
పరమావదిగా వైద్యులు
పరుగులు పెడుతున్నారు నేస్తమా..!
ఈ విధానాన్ని ఎవరొచ్చినా
నిలువరించే అవకాశం గాని
ప్రశ్నించే తత్వం గాని
ధైర్యం గాని ఎవరికీ లేదు
రాబోదు కదా నేస్తమా..!