1, జులై 2015, బుధవారం

నమస్తే.. నేస్తమా..!
ఈ రోజు వైద్యుల దినోత్సం.
వైద్యరంగం పూర్తిగా వ్యాపారం అయిపోయి,
సామాన్యునికి అందకుండాపోయింది.
వైద్యరంగ స్థితి గతులపై చర్చించుకోవడానికి
ఇంతకంటే సందర్భం ఏముంటుంది?
=============================
డాక్టర్ అనే వారు
అప్పుడూ,ఇప్పుడూ,ఎప్పుడూ
ఎవరికీ దగ్గరగా ఉండరు నేస్తమా..!
కేవలం డబ్బున్న వారికి
మాత్రమే వారు అందుబాటులో
ఉంటారు నేస్తమా..!
వైద్యం ఎప్పుడూ
ఖరీదైన వస్తువే
సామాన్యుడికి నేస్తమా..!
నాడీ వైద్యం పోయింది
అలోపతి,హోమియోపతి
పేరుతో "పరీక్షల" వైద్యం
ప్రవేశపెట్టేశారు నేస్తమా..!
ఆ ముసుగులో
కమీషన్లకు కక్కుర్తి
పడుతూ డబ్బే
పరమావదిగా వైద్యులు
పరుగులు పెడుతున్నారు నేస్తమా..!
ఈ విధానాన్ని ఎవరొచ్చినా
నిలువరించే అవకాశం గాని
ప్రశ్నించే తత్వం గాని
ధైర్యం గాని ఎవరికీ లేదు
రాబోదు కదా నేస్తమా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి