16, మార్చి 2015, సోమవారం

తుళ్ళిపడుతోంది తుళ్ళూరు ప్రజానీకం
=======================
ప్రజలెన్నుకున్న వారేమో
పక్కాగా ఏసీల్లో నిద్రోతున్నరు
ప్రజలకోసం పాడుబడాల్సిన
ప్రజాప్రతినిధులు రాజకీయం చేస్తున్నరు
రైతులు రోధిస్తున్నా భూసేకరణ పేరుతో
భూములు లాగేసుకుంటున్నరు
అధికార ప్రతినిధులది ఓ మాట
ప్రతిపక్షాలది మరోబాట
ఎందుకిలా జరుగుతోంది
ఎవరికోసం జరుగుతోంది
ఇది న్యాయమో.. అన్యాయమో
తెలియకున్నది ఆంధ్ర "సింగపూరు"లో
ఎవరి మాట వినాలన్నా అంతా గందరగోళం
తుళ్ళిపడుతోంది తుళ్ళూరు ప్రజానీకం
రాయబారం చేస్తున్నరా ..?
రాయ"భేరం" చేస్తున్నరా ..!
ముందు మీరో నిర్ణయానికి
రండి ఓ నేతలారా...! @ రాజేష్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి