1, మార్చి 2015, ఆదివారం

మోసపూరిత మాటలను మట్టుపెట్టాలనుకున్నారు
పవర్ పాలిట్రిక్స్ ను పాలదోలానుకున్నారు
సామాన్యుడిని అసమాన్యుడుగా మార్చేశారు
సామాన్యుల సత్తా ఏంటో ఢిల్లీ నేతలకు చూపించేశారు
జనరంజక పాలనకే పట్టం కట్టేశారు
దేశంలో మాకు తిరుగులేదని ఢిల్లీ గల్లీలో
తిరిగే అమిత్.. "షాకు" కొట్టించారు
ఆమ్ ఆద్మి పార్టీకి ఆధ్బుతమైన విజయం సాధించిపెట్టారు
ప్రపంచంలోని దేశాధినేతలను సైతం ఆకట్టుకున్నమోది
దేశరాజధాని లోని సామాన్యులనే ఆకట్టుకోలేక పోయారు
ఓటమిపాలైన పార్టీలు తప్పును ఒప్పుకోపోయినా
సామాన్యులను పక్కన పెడుతున్నారనేది వాస్తవం
మద్యం,డబ్బుకి బానిసలం కాదని చాటి చెప్పిన
సామాన్యుడి విజయం ఇది కాదంటారా నేస్తమా..!                            @ రాజేశ్వరరావు కొండా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి